తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 13 2024, 13:51

ఈ చవట దద్దమ్మలకు కరెంటు సక్కగ ఇయ్యొస్తలేదా?: మాజీ సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలం గాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ కదనభేరి సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగా రు.

మంచినీటి, సాగునీటి సర ఫరాలో, కరెంటు సప్లయ్‌ లో, ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఘోరంగా విఫలమైం దని ఆయన మండిపడ్డారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం, అహంకారం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే.. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పక్షాన అంత బలంగా, కాపలాదారుగా కొట్లాడు తుందని భరోసా ఇచ్చారు.

కరీంనగర్‌ కదనభేరి సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి నీళ్లకు, కరెంటుకు ఎందుకు సమ స్యలు వస్తున్నయో నాకు అర్థం కావడం లేదు. మేం ఎంతో శ్రమించి ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వడం కోసం మిషన్‌ భగీరత పథకం తీసుకొచ్చినం.

ఆదిలాబాద్‌ గోండు గూడెం నుంచి నల్ల గొండ లంబాడీ తండా దాకా అందరికీ మంచినీళ్లు అందేలా చూసి నం. బ్రహ్మాండంగా మంచినీ టి సరఫరా చేసినం. ఇప్పు డున్న ప్రభుత్వానికి ఆ పథా కాన్ని నడిపే తెలివి లేదా..? ఎందుకు మిషన్‌ భగీరథలో సమస్యలు వస్తున్నయ్‌..?’ అని ప్రశ్నించారు.

‘నేను ముఖ్యమంత్రి అయిన ప్పుడు ఏడాదినర్థం తిరగ కుండానే కరెంటు పరిస్థితిని చక్కదిద్దినం. ఒక రెప్పపా టు కూడా కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినం. దాంతో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటువచ్చిం ది.

రైతు బంధు ఇచ్చినం. కరోనా వచ్చి కాటేసినా రైతు బంధు ఆపలే. ఇయ్యాల ఆ రైతు బంధు ఏసుడు చేత నైత లేదా..? కేసీఆర్‌ జర్ర ముఖం మల్పంగనే కట్క బంద్‌జేసి నట్టు కరెంటు బందైతదా..? మేం తొమ్మి దేళ్లు ఇచ్చింది ఇయ్యాల ఈ చవట దద్దమ్మలకు ఇయ్యొస్త లేదా..?’ అని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.

ఇయ్యాల మళ్ల మీరు ఆళ్లకే ఓటేస్తే నష్టపోతరు. మేం రైతుబంధు ఎయ్యకపో యినా.. కరెంటు సక్కగ ఇయ్యకున్నా.. తాగునీటి, సాగునీటి సరఫరా సక్కగ లేకున్నా.. మోటర్లు కాలబెట్టినా.. పొలాలు ఎండబెట్టినా..జనం మళ్లీ మనకే ఓటేసిండ్రని ఆరు గ్యారంటీలకు ఎగనామం పెడ్తరు.

ఈ టైమ్‌లో మీరు కర్రు కాల్చి వాతపెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం వస్తది. అహంకారం పెరుగుతది. ఇయ్యాల చెప్పుతో కొడుత అన్నోడు రేపు నిజంగనే కొడుతడు. ఇట్ల మోసపో దామా..? లేదంటే గులాబీ జెండా ఎగరేసి మన ఎంపీల ను గెలిపించి ముందుకు పోదామా..? ఇది మన తెలంగాణ సమాజం బాగా ఆలోచించాలె.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరి తే ప్రజల పక్షాన కాపలాదా రులుగా అంత బ్రహ్మాండంగా ముందుకు పోతం’ అని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 13 2024, 13:48

స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ లు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది స్కూల్ విద్యార్థుల యూని ఫామ్‌లు కుట్టే పనులను మహిళా సంఘాలకు కేటా యిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు జీవో జారీ చేసింది.

ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 28,200 మహిళా సంఘాలకు యూనిఫామ్‌లు కుట్టే బాధ్యతలను అప్పగిం చనుంది. 63.44 లక్షల డ్రెస్సులను మహిళా సంఘాలు కుట్టనున్నాయి.

ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది. ఆయా జిల్లాల పరిధిలో డిపార్ట్‌మెంట్ల వారీగా ఎన్ని స్కూల్ యూనిఫారాలు కుట్టించాలనే వివరాలను జిల్లా కలెక్టర్లు రూపొందిం చాలని సూచించారు.

రాష్ట్ర స్థాయిలో, విద్యా శాఖ, అన్ని ఇతర రెసిడె న్షియల్ సంక్షేమ పాఠశాల లకు 63.44 లక్షల జతల యూనిఫామ్స్ అవసరమ వుతాయి. ఈ యూనిఫా మ్స్‌ను 45 రోజుల్లో కుట్టించాల్సి ఉంటుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 12 2024, 09:25

నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడ రానున్న సీఎం.  

కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ను ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి. 

విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ లబ్ధిదారులకు అందజేయనున్న సీఎం...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 12 2024, 09:20

శత్రుభయంకర అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం... గర్విస్తున్నామన్న ప్రధాని మోదీ

భారత్ రక్షణ రంగ చరిత్రలో మరో అరుదైన ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.

ఈ క్షిపణిని పూర్తి దేశీ యంగా అభివృద్ధి చేశారు. దీన్ని మొదటిసారిగా గాల్లో కి పంపగా, అంచనా లను అందుకుంటూ డీఆర్డీవో శాస్త్రవేత్తలను ఆనందో త్సాహాలకు గురిచేసింది.

ఈ ప్రాజెక్టుకు మిషన్ దివ్యా స్త్రగా నామకరణం చేశారు. అగ్ని-5 క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్- MIRV టెక్నాలజీ వినియోగించారు.

MIRV టెక్నాలజీతో రూపొందించిన క్షిపణిని ఒక్కసారి ప్రయోగించాక... అందులోని వార్ హెడ్ పలు విభాగాలుగా విడిపోయి, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.

మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైన నేప థ్యంలో ప్రధాని మోడీ... DRDO సైంటిస్టులను అభినందించారు. DRDO శాస్త్రవేత్తలు చేపట్టిన మిషన్ దివ్యాస్త్ర పట్ల గర్విస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 12 2024, 09:18

AP News: అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ

విజయవాడ (గాంధీనగర్‌), ముమ్మిడివరం: వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) జైభీమ్‌ భారత్‌ పార్టీలో చేరారు..

సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 09 2024, 15:22

ఎండిన పంటలను అంచనా వేసి ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలి

ఎండిన పంటలు అంచనా వేసి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జునప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలు అప్పాజీపేట, కంచనపల్లి, అనంతరం, కొత్తపల్లి, జి చెన్నారం గ్రామాలలో ఎండిన పంట పొలాలను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగుచేసిన పంట పొలాలు తమ కళ్ళముందే చేతికొచ్చే సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి రైతులు అనేక ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో రైతులు నిబ్బరంగా ఉండాలని రైతులను కోరారు. ఇలాంటి విపత్కర సమయాలలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని  అవేదన వ్యక్తం చేశారు. నివారించడం కొరకు ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే నష్టపోయిన పొలాలను పర్యవేక్షించిపంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందు చూపుతో వ్యవహరించి ఎస్ఎల్బీసీ కాల్వకు నీళ్లు వదిలినట్లయితే ఎంతో కొంత భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎండిపోకుండా ఉండడానికి దోహదపడేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు రైతుల పంటలను త్వరగా అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ రైతులు పోషబోయిన యాదయ్య, దేప రామకృష్ణారెడ్డి, పోషవోని మల్లయ్య, కేతిపల్లి యాదయ్య, కల్లూరి రాములు, పోలే తానేష బకరం చిన్న, కాసర్ల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 09 2024, 15:15

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి పరామర్శ

అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక సురక్షా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నల్గొండ మాజీ MPP దైద రజిత గారి భర్త వెంకట్ రెడ్డి గారిని పరామర్శించిన కంచర్ల భూపాల్ రెడ్డి గారు

ఇదే అంశంపై సురక్షా ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా.రాకేశ్ రెడ్డి గారిని కలుసుకొని మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 06 2024, 12:51

టీజేఎస్ లో చేరిన బిఎస్పి నాయకులు


 

 తెలంగాణ జన సమితి పార్టీ విధానాలు నచ్చి పనిచేయుటకు ముందుకు వచ్చిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ బీఎస్పీ నాయకులు జి నాగేశ్వరరావు, మునుగోడు నియోజకవర్గ నాయకులు మల్గా యాదయ్య, నారీ బలరాజు కు నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయం నాంపల్లిలో ప్రొఫెసర్ కోదండరాం సార్ కండువలు కప్పి ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నల్గొండ జిల్లా పార్టీ బలోపేతం చేయుటకు కృషి చేయాలని కోరినారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్  నల్గొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, కార్యదర్శి పులి పాపయ్య, సర్దార్ వినోద్ కుమార్ ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వంలో తెలంగాణ జన సమితి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చుటకు అవినీతి లేని ఆత్మ గౌరవ సమాజం కోసం పనిచేస్తున్న తెలంగాణ జన సమితిలో ఉద్యమకారులు మేధావులు నిరుద్యోగ యువతీ యువకులు తెలంగాణ జన సమితిని మరింత బలోపేతం చేయుటకు పార్టీలో చేరాలని కోరినారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 19:21

ఆత్మీయ సమ్మేళనం ఓ మధురానుభూతి

విద్యార్థులు తన ఉపాధ్యాయులతో నిర్వహించుకునే ఆత్మీయ సమ్మేళనం ఓ మధురానుభూతిని మిగుల్చుతుందని గీతాంంజలి పాఠశాల కరస్పాండెంట్ మారోజు భారతి విజయ్ కుమార్ అభిప్రాయ పడ్డారు.

2008-09 సంవత్సరపు విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.

బాల్యంలో తల్లిదండ్రులు గురువులైతే విద్యాబోదనతో పాటు సమాజంలో మెలకువలను నేర్పేది ఉపాధ్యాయులని అన్నారు.

పట్టుదలతో చదివిన ప్రతి ఒక్కరు నేడు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. మున్ముందు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇస్మాయిల్,ఊటుకూరి రవీందర్, దామళ్ళ యల్లయ్య,గంట యల్లయ్య,విజయ,నిర్మల,పూర్వక విద్యార్థులు వినయ్,అశోక్,ఖాలేద్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 03 2024, 18:22

కమలం గూటికి బిఆర్ఎస్ కీలక నేత

వరంగల్‌ జిల్లాలో గులాబీ పార్టీకి మరో భారీ షాక్ తలిగింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ అగ్ర నేతలు ఆయనను కలిసినట్లు సమాచారం. అయితే రమేష్ పార్టీ మారుతుం డటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టే అవుతుం దని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గత కొంతకాలంగా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర రమేష్ చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోం ది. ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతు న్నారు.

అయితే ఆరూరి రమేష్‌తో బీఆర్ఎస్ అగ్ర నేతలు బుజ్జగించేందుకు ప్రయ త్నిస్తున్నారు. మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రమేష్‌ను బుజ్జగించే బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది.

కానీ ఆయనని బుజ్జగిం చేందుకు కడియం అంగీ కరించలేదు. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను బీఆర్ఎస్ అధిష్ఠానం రంగంలోకి దించింది. ఆరూరి రమేష్‌ను పార్టీ మారకుండా బస్వ రాజు బుజ్జగిస్తున్నారు.

అయితే రమేష్ పార్టీ మారేందుకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి ఆయన పోటీకి దిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరేందుకు 15మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైన విషయం తెలిసిందే.

అయితే రమేష్ కూడా పార్టీ మారుతుండటంతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కకావికలం అవుతోంది. వలసలు ఇలాగే కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...